సఫారీలతో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు నెమ్మదిగా పుంజుకుంటోంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (9) స్వల్పస్కోరుకే వెనుతిరగడంతో మరోసారి జట్టును ముందుకు లాక్కెళ్లాల్సిన బాధ్యత మాజీ సారధి విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్లపై పడింది.
వీళ్లిద్దరూ సంయమనంతో ఆడుతున్నారు. బౌన్స్తో సఫారీ బౌలర్లు ఇబ్బంది పెడుతున్న కూడా జాగ్రత్తగా ఆడుతున్నారు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 50/1 స్కోరుతో నిలిచింది. ఈ మ్యాచ్ కూడా ఓడితే వన్డే సిరీస్లో భారత్ క్లీన్ స్వీప్ అవుతుంది.
ఇప్పటికే రెండు వన్డేల్లో ఓటమిపాలైన టీమిండియా.. ఈమ్యాచ్ ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. కోహ్లీ అభిమానులు ఈ మ్యాచ్లో అయినా తమ అభిమాన బ్యాటర్ సెంచరీ చేస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు.