వరుసగా రెండు ఓటముల తర్వాత భారత జట్టు అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) అద్భుతమైన ఆరంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (14), రిషభ్ పంత్ (6), దినేష్ కార్తీక్ (6) విఫలమైనా హార్దిక్ పాండ్యా (31 నాటౌట్) రాణించాడు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన భారత్ 179 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పవర్ప్లేలోనే స్పిన్నర్ను దింపాలనే పంత్ వ్యూహం పనిచేసింది. అక్షర్ పటేలో తన తొలి ఓవర్లోనే భారత్కు బ్రేక్ ఇచ్చాడు. సఫారీ కెప్టెన్ బవుమా (8)ను పెవిలియన్ చేర్చాడు. పవర్ప్లే చివరి బంతికి హర్షల్ బౌలింగ్లో హెండ్రిక్స్ (23) కూడా అవుటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాటర్నూ భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. ప్రమాదకరమైన వాన్ డర్ డస్సెన్ (1), డేవిడ్ మిల్లర్ (3)ను తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేర్చారు. దీంతో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన సౌతాఫ్రికా.. 19.1 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 48 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో హర్షల్ పటేల్ 4, చాహల్ 3 వికెట్లతో సత్తాచాటగా.. భువీ, అక్షర్ చెరో వికెట్ తీసుకున్నారు.