భారత్తో జరుగుతున్న తొలి టీ20లో సౌతాఫ్రికాకు అనుకున్న ఆరంభం లభించలేదు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సఫారీ జట్టును యువ పేసర్లు దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్ ముప్పుతిప్పలు పెట్టారు.
పిచ్ నుంచి సహకారం లభించడంతో అద్భుతమైన స్వింగ్ డెలివరీలు వేసిన వాళ్లు.. సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా (0), క్వింటన్ డీకాక్ (1), రైలీ రూసో (0), డేవిడ్ మిల్లర్ (0), ట్రిస్టియన్ స్టబ్స్ (0)ను వెంట వెంటనే పెవిలియన్ చేర్చారు. ఎయిడెన్ మార్క్రమ్ (17 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి వేన్ పార్నెల్ నుంచి కొంత సహకారం అందుతోంది. ఈ క్రమంలో పవర్ప్లే ముగిసేసరికి సఫారీ జట్టు 5 వికెట్ల నష్టానికి 30 పరుగులతో నిలిచింది.
Here's how the Proteas were reduced to 9-5 in 2.3 overs by India.
Aiden Markram and Wayne Parnell are currently working on rescuing the innings 🛟 #INDvSA pic.twitter.com/wOkrWQHFHO
— Superbru (@Superbru) September 28, 2022