మూడో టెస్టులో చరిత్ర పునరావృం చేసేందుకు సఫారీలు అడుగు దూరంలో నిలిచారు. మునుపటి వాడి లేని సఫారీ జట్టును ఎలాగైనా వారి గడ్డపైనే ఓడించి, టెస్టు సిరీస్ సొంతం చేసుకోవాలన్న టీమిండియా కల నెరవేరేలా లేదు. రెండో ఇన్నింగ్సులో భారత బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరచడంతో ప్రొటీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో టీమిండియా విఫలమైంది.
పోరాడే స్కోరు తక్కువగా ఉండటంతో భారత బౌలర్లు కూడా సరిగా ప్రభావం చూపలేకపోతున్నారు. మరో రోజు ఆట మిగిలే ఉండటంతో సఫారీలు చాలా నెమ్మదిగా టార్గెట్ను ఛేజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రొటీస్ ఛేజ్ను ముందుండి నడిపించిన కీగన్ పీటర్సన్ (82)ను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్ చేర్చాడు.
అయితే ఆ తర్వాత మరో వికెట్ పడకుండా వాన్ డర్ డస్సెన్ (22 నాటౌట్), టెంబా బవుమా (12 నాటౌట్) అడ్డుకున్నారు. పీటర్సన్ వికెట్ పడిన తర్వాత భారత బౌలర్లు పరుగులు కట్టడి చేసినప్పటికీ.. వికెట్లు మాత్రం దక్కడం లేదు. దీంతో లంచ్ సమయానికి సఫారీ జట్టు 171/3తో నిలిచింది. భారత్పై విజయం సాధించి చరిత్ర పునరావృతం చేయడానికి ప్రొటీస్ మరో 41 పరుగులు చేస్తే చాలు.