సిరీస్ నెగ్గాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత బౌలింగ్ దళం అదరగొట్టింది. ప్రతి బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో సఫారీ జట్టు 99 పరుగులకే చాపచుట్టేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలో హైదరబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ షార్ట్ బాల్స్తో ప్రత్యర్థికి ముచ్చెమటలు పోయించాడు. అతనితోపాటు వాషింగ్టన్ సుందర్ కూడా రాణించాడు.
మిడిల్ ఓవర్లలో షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీళ్లందరూ క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో సఫారీ జట్టు ఏ దశలోనూ కోలుకునేలా కనిపించలేదు. ఆ జట్టులో హెన్రిక్ క్లాసెన్ (34) పరుగులే టాప్ స్కోర్ అంటేనే వాళ్ల బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన ఆ జట్టుకు ఓపెనర్లు జానెమన్ మలన్ (15), క్వింటన్ డీకాక్ (6) శుభారంభం ఇవ్వలేకపోయారు.
ఆ తర్వాత వచ్చిన రీజా హెండ్రిక్స్ (3), ఎయిడెన్ మార్క్రమ్ (9), డేవిడ్ మిల్లర్ (7) కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. చివర్లో మార్కో జాన్సెన్ (14) ఆటతీరు చూస్తే ఆ జట్టు కనీసం 100 పరుగులైనా చేస్తుందని అనిపించింది. అయితే కుల్దీప్ యాదవ్ వాళ్లకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు.
టెయిలెండర్లను వరుసపెట్టి పెవిలియన్ చేర్చి 99 పరుగులకే ఆ జట్టు కథ ముగించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో సత్తా చాటగా.. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
.@imkuldeep18 put on a superb show with the ball & was #TeamIndia's top performer from the first innings of the third #INDvSA ODI. 👌 👌
A summary of his bowling performance 🔽 pic.twitter.com/ONa6JYzEUi
— BCCI (@BCCI) October 11, 2022