భారత్తో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 237 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లో సఫారీ కెప్టెన్ బవుమా (0) ఒక్క పరుగు కూడా చెయ్యలేకపోయాడు. అర్షదీప్ సింగ్ వేసిన రెండో ఓవర్లో లెంగ్త్ బాల్ను మిడాఫ్ మీదుగా బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు.
అయితే అది సరిగా కనెక్ట్ కాకపోవడంతో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీకి సులభమైన క్యాచ్ దొరికింది. ఆ తర్వాత కాసేపటికే.. ఫామ్లో ఉన్న రైలీ రూసో (0) కూడా డకౌట్ అయ్యాడు. అర్షదీప్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను.. దాన్ని సరిగా అంచనా వేయలేకపోయాడు.
దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. ఈ క్యాచ్ అందుకోవడంతో తడబడిన దినేష్ కార్తీక్ మూడో ప్రయత్నంలో పట్టేశాడు. దాంతో సఫారీ జట్టు ఒక్క పరుగు వద్దనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.