వాండరర్స్ టెస్టులో భారత జట్టుకు తిప్పలు తప్పడం లేదు. రాహుల్ వికెట్తో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును పంత్, అశ్విన్ ఆదుకుంటారని అభిమాులు ఆశించారు. కానీ మార్కో జాన్సెన్ బౌలింగ్లో పంత్ (17) అవుటయ్యాడు.
అప్పటి వరకూ పంత్కు నుంచి దూరంగా బంతులు వేసిన జాన్సెన్.. సడెన్గా ఆఫ్స్టంప్ మీదకు లెంగ్త్ బాల్ వేశాడు. దీంతో తడబడిన పంత్ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతను విఫలమవడంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. నేరుగా వెళ్లి వికెట్ కీపర్ వెరీనే చేతుల్లో పడింది. దీంతో 17 పరుగుల పంత్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ కూడా నిరాశపరిచాడు. ధాటిగా ఆడుతున్న అశ్విన్కు సహకారం అందించడంలో విఫలమయ్యాడు. ఆఫ్స్టంప్ ఆవల వెళ్తున్న బంతిని కట్ చేసి గల్లీ ఫీల్డర్కు నేరుగా క్యాచ్ ఇచ్చాడు. కీగన్ పీటర్సన్ క్యాచ్ అందుకోవడంతో శార్దూల్ వెనుతిరిగాడు. ఒక్క పరుగు చేయకుండానే ఆలివర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం అశ్విన్, షమీ క్రీజులో ఉన్నారు.