సౌతాఫ్రికాపై తొలిసారి స్వదేవంలో టీ20 సిరీస్ గెలిచిన భారత జట్టు.. అదే ఊపులో వన్డే సిరీస్ కూడా తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో ఆ జట్టు 99 పరుగులకే కుప్పకూలింది.
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ను ఓపెనర్ శుభ్మన్ గిల్ (49) ముందుండి నడిపించాడు. శిఖర్ ధవన్ (8), ఇషాన్ కిషన్ (10) ఇద్దరూ విఫలమయ్యారు. ధవన్ అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అవగా.. బంతిని అంచనా వేయలేక ఇషాన్ పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో గిల్కు జతకలిసిన శ్రేయాస్ అయ్యర్ (28 నాటౌట్) మంచి సహకారం అందించాడు.
అయితే 18వ ఓవర్లో ఎన్గిడీ వేసిన బంతిని అంచనా వేయలేకపోయిన గిల్.. హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో పెవిలియన్ చేరాడు. దీంతో సంజూ శాంసన్ (2 నాటౌట్)తో కలిసి శ్రేయాస్ లాంఛనం పూర్తి చేశాడు. 20వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
దీంతో భారత జట్టు 19.1 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు సాధించింది. సఫారీలపై ఏడు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎన్గిడీ, బ్యోర్న్ ఫోర్టూయిన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది.
Kuldeep, Washy, Siraj bowl India to a dominant win in the ODI series decider #INDvSA
👉 https://t.co/zbLsDgPHAK pic.twitter.com/k4YbSKfBlr
— ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2022