సఫారీ సిరీస్లో విజేతను నిర్ణయించే మూడో టెస్టు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్సులో శుభారంభం అందించలేకపోయిన భారత ఓపెనర్లు రెండో ఇన్నింగ్సులో కూడా నిరాశపరిచారు. మయాంక్ అగర్వాల్ (7), కేఎల్ రాహుల్ (10) పరుగులు మాత్రమే చేశారు.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పుజారా (9 నాటౌట్), కోహ్లీ (14 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. జాన్సెన్, రబాడ, ఎన్గిడీ వేసిన ఆఫ్సైడ్ బంతుల గాలానికి పడకుండా ఇద్దరూ సంయమనం పాటించారు. దీంతో భారత జట్టు రెండో రోజు ఆటను 57/2 స్కోరు వద్ద ముగించింది.
దీంతో సఫారీలపై భారత్ 70 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో సఫారీ జట్టు 210 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రాతోపాటు ఉమేష్ యాదవ్ 2, షమీ 2, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు.