భారత బ్యాటర్లను సఫారీ పేసర్ రబాడ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు. అతని బౌలింగ్ ఆడేందుకు భారత బ్యాటర్లు నానాతిప్పలూ పడుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో రబాడ బౌలింగ్లో స్వల్పస్కోరుకే పెవిలియన్ చేరిన మయాంక్ అగర్వాల్.. మరోసారి నిరాశపరిచాడు.
కీలకమైన మూడో టెస్టు రెండో ఇన్నింగ్సులో 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబాడ బౌలింగ్లోనే అవుటయ్యాడు. రబాడ వేసిన అద్భుతమైన డెలివరీని ఆడటానికి మయాంక్ ప్రయత్నించాడు. కానీ యాంగిల్ తీసుకున్న బంతి.. బ్యాట్ను ముద్దాడి ఫస్ట్ స్లిప్లో ఉన్న ఎల్గార్ చేతుల్లో పడింది.
నేరుగా వచ్చిన క్యాచ్ను ఎల్గాను చటుక్కున పట్టేయడంతో మయాంక్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత కాసేపటికే యువపేసర్ మార్కో జాన్సెన్ బౌలింగ్లో రాహుల్ పెవిలియన్ చేరాడు. జాన్సెన్ వేసిన బంతిని అనవసరంగా డ్రైవ్ చేసేందుకు రాహుల్ ప్రయత్నించాడు.
దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి సెకండ్ స్లిప్లో మార్క్రమ్కు క్యాచ్ వెళ్లింది. దీంతో ఆరంభంలోనే ఓపెనర్లిద్దరినీ కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, పుజారా ఉన్నారు.