నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 100 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జట్టుకు శిఖర్ ధవన్ (8)తో కలిసి శుభ్మన్ గిల్ (30 నాటౌట్) మంచి ఆరంభం అందించాడు. అయితే 7వ ఓవర్ తొలి బంతిని పాయింట్ దిశగా పంపిన ధవన్.. సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జాన్సెన్ వెంటనే బంతిని అందుకోవడంతో గిల్ పరుగు వద్దన్నాడు.
దీంతో ధవన్ కూడా వెనుతిరిగాడు. అప్పటికే బంతి అందుకున్న జాన్సెన్ కీపర్కు బంతి విసరడంతో అతను వికెట్లను కూల్చాడు. అప్పీల్ను థర్డ్ అంపైర్కు పంపగా.. ధవన్ బ్యాటు క్రీజును తాకకముందే వికెట్లు కూలినట్లు తేలింది. దీంతో భారత జట్టు 42 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.