టీమిండియాతో ఆడుతున్న తొలి టీ20లో పరుగుల వేటలో సఫారీలు చెమటోడుస్తున్నారు. 212 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగినా సౌతాఫ్రికా ఆటగాళ్లు.. ముందు దూకుడు ప్రదర్శించినప్పటికీ కాసేపటికే చతికిలపడ్డారు. వంద పరుగులు చేయడానికి దాదాపు 12 ఓవర్లు కష్టపడాల్సి వచ్చింది. 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో డస్సెన్ (28), మిల్లర్ (37) ఉన్నారు.