భారత్లో క్రికెట్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. ఏ మ్యాచ్కైనా సరే స్టాండ్స్ ఫుల్ అయిపోవాల్సిందే. దానికితోడు కరోనా మహమ్మారి తర్వాత దేశంలో చాలా స్టేడియాల్లో ఇంకా అంతర్జాతీయ మ్యాచులు జరగలేదు. అలాంటి సమయంలో సౌతాఫ్రికాతో టీ20 (IND vs SA) సిరీస్ మొదలైంది. రెండో మ్యాచ్కు కటక్లోని బారాబటి స్టేడియం వేదికకానుంది.
కరోనా తర్వాత ఇక్కడ జరుగుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ (IND vs SA) కావడంతో.. అభిమానులు ఈ స్టేడియానికి పోటెత్తుతున్నారు. శనివారం నాడు భారత జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కూడా స్టాండ్స్ నిండిపోయి ఉన్నాయి. పంత్, ఉమ్రాన్, పాండ్యా ప్రాక్టీస్ చేస్తుంటే.. స్టేడియంలో కూర్చున్న వేలాదిమంది ప్రేక్షకులు చూస్తూ కూర్చున్నారు. బీసీసీఐ ఈ ఫొటోలను ట్విట్టర్లో పంచుకుంటూ.. మ్యాచ్ లేని రోజు కూడా మ్యాచ్ హీట్ కనిపిస్తోంది అంటూ ట్వీట్ చేసింది. ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.
Match day feels on a non-match day. 👌 👌
A packed stadium here in Cuttack to watch #TeamIndia train. 💪#INDvSA | @Paytm pic.twitter.com/lLYwx06Jk3
— BCCI (@BCCI) June 11, 2022