సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత జట్టును దినేష్ కార్తీక్ (55) ఆదుకున్నాడు. ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (5), శ్రేయాస్ అయ్యర్ (4) విఫలమయ్యారు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 27) కూడా అనవసర షాట్కు యత్నించి పెవిలియన్ చేరాడు.
పవర్ప్లే ముగియక ముందే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ (23 బంతుల్లో 17) టెస్టు తరహా ఇన్నింగ్స్ ఆడి క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు తన పేలవ ఫామ్ కొనసాగిస్తూ కేశవ్ మహరాజ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఇలాంటి సమయంలో హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 46) తన ఇన్నింగ్స్ వేగం పెంచాడు.
అతనికి జత కలిసిన దినేష్ కార్తీక్ 27 బంతుల్లోనే 55 పరుగులతో చెలరేగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఒక దశలో టీమిండియా కనీసం 130 పరుగులు చేస్తుందా? అన్న స్థితి నుంచి పోరాడగలిగే స్కోరు చేసిందంటే..
హార్దిక్, డీకే బ్యాటింగ్ వల్లనే అని చెప్పాలి. సఫారీ బౌలర్లలో ఎన్గిడీ రెండు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, డ్వెయిన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, ఆన్రిచ్ నోర్జీ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
Innings Break! @DineshKarthik & @hardikpandya7 starred with the bat as #TeamIndia post 169/6 on the board. 👏 👏
Over to our bowlers now. 👍 👍
Scorecard ▶️ https://t.co/9Mx4DQmACq #INDvSA | @Paytm pic.twitter.com/X3YBMFM7tV
— BCCI (@BCCI) June 17, 2022