దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడే జట్టును బీసీసీఐ వెల్లడించింది. మొత్తం 18 మందితో వన్డే జట్టును ప్రకటించింది. గాయం కారణంగా టెస్టు సిరీస్కు దూరమైన రోహిత్ శర్మ ఈ సిరీస్కు కూడా దూరమయ్యాడు. దీంతో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్కు జట్టు పగ్గాలందించారు. వైస్ కెప్టెన్గా పేసర్ జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ ప్రకటించింది.
తాను వన్డేలకు అందుబాటులోనే ఉంటానని, బీసీసీఐని ఎటువంటి సెలవు కోరలేదని సౌతాఫ్రికా టూర్కు ముందు స్పష్టం చేసిన కోహ్లీ.. చెప్పినట్లే వన్డే సిరీస్కు అందుబాటులో ఉన్నాడు. దీంతో అతనికి కూడా వన్డే జట్టులో చోటు దక్కింది. పంత్తోపాటు ఇషాన్ కిషన్ను మరో వికెట్ కీపర్గా ఎంపిక చేసింది. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్కు జట్టులో అనూహ్యంగా చోటు దక్కింది. భారత యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్కు కూడా ఈ బృందంలో చోటుదక్కొంది. హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టిన సెలెక్టర్లు వెంకటేశ్ అయ్యర్కు అవకాశం కల్పించారు.
జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్.
TEAM : KL Rahul (Capt), Shikhar Dhawan, Ruturaj Gaekwad, Virat Kohli, Surya Kumar Yadav, Shreyas Iyer, Venkatesh Iyer, Rishabh Pant (wk), Ishan Kishan (wk), Y Chahal, R Ashwin, W Sundar, J Bumrah (VC), Bhuvneshwar Kumar,Deepak Chahar, Prasidh Krishna, Shardul Thakur, Mohd. Siraj
— BCCI (@BCCI) December 31, 2021