గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ ఓపెనింగ్ గేమ్లో దాయాది పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో సిరీస్ ప్రారంభించిన భారత్ ఆ తర్వాత న్యూజిల్యాండ్ చేతిలో కూడా ఓటమి చవిచూసింది. దీంతో కనీసం సెమీస్ కూడా చేరకుండానే తిరుగుముఖం పట్టింది.
ఈ క్రమంలో ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్లో ఎలాగైనా పగ తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే ఈసారి కూడా గతేడాది సీన్ రిపీట్ అవుతుందని, పాక్ చేతిలో భారత జట్టు ఓడిపోతుందని పాక్ మాజీ దిగ్గజం షోయబ్ అక్తర్ చెప్పాడు.
ఈ రెండు జట్లు మరోసారి అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా టీ20 ప్రపంచకప్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో తమ జట్టే గెలుస్తుందని షోయబ్ అభిప్రాయపడ్డాడు. ‘టీ20లలో భారత్ కన్నా పాకిస్తాన్ మెరుగైన జట్టు.
అదే సమయంలో పాక్తో మ్యాచ్ అంటే భారత మీడియా ఆ జట్టుపై అనవసరమైన ఒత్తిడి పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ చేతిలో భారత్ ఓడటం సాధారణ విషయమే’ అని అక్తర్ అన్నాడు.