పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్కు ఊహించిన ఆరంభం లభించలేదు. 148 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. అయితే ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (29 నాటౌట్).. కెప్టెన్ రోహిత్(4 నాటౌట్)కు జత కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు.
వీళ్లిద్దరూ అనవసర షాట్లకు పోకుండా నిదానంగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో పవర్ప్లే ముగిసే సరికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 38 పరుగులతో నిలిచింది.
That's the end of the powerplay and #TeamIndia are 38/1
Live – https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/QMYOn7tznK
— BCCI (@BCCI) August 28, 2022