టీ20 ప్రపంచకప్లో భారత్కు బ్యాటుతో శుభారంభం దక్కలేదు. పాకిస్తాన్తో తన తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్.. బ్యాటింగ్లో తడబడుతోంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కేఎల్ రాహుల్ (4), రోహిత్ శర్మ (4) ఇద్దరూ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (15) కాసేపు ఆకట్టుకున్నాడు.
అయితే హారిస్ రవూఫ్ వేసిన ఆరో ఓవర్లో మీదకు వచ్చేసిన షార్ట్ బాల్కు వికెట్ పారేసుకున్నాడు. ఆ బంతిని థర్డ్ మ్యాన్ వైపు ఆడేందుకు ప్రయత్నించిన సూర్య.. విఫలమయ్యాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ రిజ్వాన్ చేతుల్లో పడింది. భారత జట్టు పవర్ప్లే ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 31 పరుగులతో నిలిచింది.