దుబాయ్: ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్లో భారత అభిమానులకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ (0) తాను ఎదుర్కొన్న తొలిబంతికే డకౌట్గా వెనుతిరిగాడు. దీంతో భారత్ ఒక రన్కే ఒక వికెట్ కోల్పోయినట్లయింది. ఓపెనర్లుగా రోహిత్తోపాటు రాహుల్ దిగాడు.
షహీన్ అఫ్రిదీ వేసిన తొలి ఓవర్లో మూడు బంతులు ఎదుర్కొన్న రాహుల్ ఒక పరుగు తీశాడు. అనంతరం తాను ఎదుర్కొన్న తొలి బంతికే రోహిత్ ఎల్బీగా వెనుతిరిగాడు. రోహిత్ అవుటవడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ఆరంభంలో ఆటగాళ్లంతా ఒక మోకాలిపై కూర్చొని ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమానికి మద్దతు తెలిపారు.