పాకిస్తాన్తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. దూకుడైన ఆటతో ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (28) పెవిలియన్ చేరాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కేఎల్ రాహుల్ (28 నాటౌట్)తో కలిసి రోహిత్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. వీళ్లిద్దరూ భారీ షాట్లతో ఎదురు దాడికి దిగడంతో పాక్ బౌలర్లు తడబడ్డారు.
అయితే పవర్ప్లే చివరి ఓవర్ తొలి బంతికి హారిస్ రవూఫ్ బౌలింగ్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ విఫలమయ్యాడు. దీంతో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లో చాలా ఎత్తుగా లేచింది. ఫఖర్ జమాన్, ఖుష్దిల్ షా ఇద్దరూ క్యాచ్ కోసం ప్రయత్నించగా.. ఖుష్దిల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ క్రమంలో పవర్ప్లే ముగిసే సరికి భారత జట్టు 62/1 స్కోరుతో నిలిచింది.