పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడిన పంత్.. 14వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఆ ఓవర్ ఐదో బంతికి రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించిన అతను బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ఆసిఫ్ అలీకి సులభమైన క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.
ఆ వెంటనే హార్దిక్ పాండ్యా కూడా అవుటయ్యాడు. మహమ్మద్ హస్నయిన్ వేసిన 15వ ఓవర్లో బంతిని లెగ్సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన పాండ్యా.. మహమ్మద్ నవాజ్కు క్యాచ్ ఇచ్చాడు. నవాజ్ అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో పాండ్యా పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు.