భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. బాబర్ ఆజమ్ (10), ఫఖర్ జమాన్ (10) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరినప్పటికీ.. మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (29 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్ (16 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.
అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పది ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 68 స్కోరుతో నిలిచింది.