దుబాయ్: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచకప్ పోరులో పాకిస్థాన్ జట్టుకు శుభారంభం లభించింది. ఓపెనర్లు బాబర్ ఆజమ్ (17 నాటౌట్), మహమ్మద్ రిజ్వాన్ (25 నాటౌట్) పాకిస్థాన్కు మంచి ఆరంభం అందించారు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో పాక్ జట్టు 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్లేమీ కోల్పోకుండా 43 పరుగులు చేసింది. పాక్ బ్యాట్స్మెన్ వికెట్ల కోసం భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు.