దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో టీమిండియాకు మరో షాక్ తగిలింది. పవర్ప్లే ముగిసిన వెంటనే స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (28) కూడా పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్.. లాంగాన్లో ఉన్న మహమ్మద్ నవాజ్కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 62 పరుగులకు ఇద్దరు సెటిల్డ్ బ్యాటర్ల వికెట్లు కోల్పోయింది.