పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (4) మరోసారి నిరాశ పరిచాడు. నసీమ్ షా వేసిన రెండో ఓవర్లో బంతిని ఆఫ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్.. వికెట్ల మీదకు ఆడుకున్నాడు. దీంతో భారత జట్టు 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ జట్టు.. ఇఫ్తికర్ అహ్మద్ (51), షాన్ మసూద్ (52) రాణించడంతో 159/8 స్కోరు సాధించింది. భారత్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.