కామన్వెల్త్ గేమ్స్లో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ మహిళలు చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలవకలేకపోయిన పాక్ బ్యాటర్లు.. ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్కు క్యూ కట్టారు. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో పాక్ జట్టు 99 పరుగులకు ఆలౌట్ అయింది.
పాక్ ఓపెనర్ మునీబ్ అలీ (32) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. ఇరామ్ జావెద్ (0), బిస్మా మరూఫ్ (17), ఒమమా సొహైల్ (10), ఆయేషా నసీమ్ (10), అలియా రియాజ్ (18), ఫాతిమా సనా (8), కైనత్ ఇంతియాజ్ (2), డయానా బైగ్ (0), ట్యూబా హసన్ (1) అందరూ స్వల్ప స్కోర్లు మాత్రమే చెయ్యగలిగారు.
చివరిదైన 18వ ఓవర్లో పాక్ జట్టు ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో కేవలం 99 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, రాధా యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. రేణుకా సింగ్ మేఘనా సింగ్ షెఫాలీ వర్మ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.