దుబాయ్: భారత్, పాక్ మధ్య హైఓల్టేజ్ పోరు నరాలు తెగే ఉత్కంఠతో సాగుతోంది. టాస్ గెలిచిన పాక్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా తొలి ఓవర్లోనే భారత్కు అత్యంత కీలకమైన రోహిత్ శర్మ (0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మూడో ఓవర్లో ఫామ్లో ఉన్న రాహుల్ (3) కూడా పెవిలియన్ చేరాడు. వీరిద్దరినీ షాహీన్ అఫ్రిదీనే అవుట్ చేశాడు.
ఒక సిక్స్, ఒక ఫోర్తో ఆశలు రేపిన సూర్యకుమార్ యాదవ్ (11) కూడా నిరాశ పరిచాడు. ఇలా వెంట వెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును కెప్టెన్ విరాట్ కోహ్లీ (26నాటౌట్) ఆదుకున్నాడు.
అతనితోపాటు రిషభ్ పంత్ (19 నాటౌట్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. భారత జట్టు పది ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది.