భారత బ్యాటింగ్ యూనిట్ మరోసారి కుదేలవుతోంది. పవర్ప్లేలోనే రోహిత్, రాహుల్, సూర్యకుమార్ కీలక వికెట్లు కోల్పోయిన భారత్కు ఆ తర్వాతి బంతికే మరో దెబ్బ తగిలింది. క్రీజులో లెఫ్ట్ హ్యాండర్ అవసరం ఉందని భావించిన జట్టు అక్షర్ పటేల్ను పంపింది. అతను లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.
షాదాబ్ ఖాన్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతిని బాబర్ ఆజమ్ వైపు పంపిన అక్షర్.. వెంటనే పరుగు కోసం ముందుకొచ్చాడు. అయితే అక్కడ పరుగు రాదు. దీంతో కోహ్లీ అతన్ని వెనక్కు పంపాడు. అప్పటికే బంతి అందుకున్న బాబర్.. కీపర్కు దాన్ని విసిరాడు. అతను బంతిని పట్టుకోవడంలో తడబడినా థర్డ్ అంపైర్ రనౌట్గా ప్రకటించాడు. దీంతో భారత జట్టు 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.