టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ టెస్టు అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. గురువారం నుంచి కాన్పూర్లోని గ్రీన్పార్క్ మైదానంలో జరిగే టెస్టులో అతను అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని జట్టు తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
శ్రేయాస్ ఇప్పటి వరకు ఫస్ట్క్లాస్ క్రికెట్లో 54 మ్యాచులు ఆడాడు. ఈ మ్యాచుల్లో 52.18 సగటుతో 4,592 పరుగులు చేశాడు. ఇటీవల న్యూజిల్యాండ్తో జరిగిన టీ20 సిరీస్లో కూడా ఆడాడు. ఇప్పటి వరకూ భారత్ తరఫున అయ్యర్ 22 వన్డేలు, 35 టీ20 మ్యాచ్లు ఆడాడు.
రహానే చెప్పిన విషయం నిజమై శ్రేయాస్ అయ్యర్కు కనుక గురువారం నాడు భారత టెస్టు జట్టులో స్థానం దక్కితే.. టీమిండియా తరఫున టెస్టు మ్యాచ్ ఆడే 303వ ఆటగాడిగా అయ్యర్ నిలుస్తాడు.