IND vs NZ : భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. జాకబ్ డఫె ఓవర్లో కోహ్లీ (36) క్యాచ్ అవుట్ అయ్యాడు. అంతకుముందు అతని ఓవర్లో ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. జాకబ్ డఫీ వేసిన 34వ ఓవర్ మూడో బంతికి అనూహ్యంగా రనౌట్ అయ్యి వెనుదిరిగాడు. బంతి ఫీల్డర్ దగ్గర పడడంతో ఇషాన్ పరుగుకు ప్రయత్నించి వెనక్కి మళ్లాడు. కానీ కోహ్లీ అప్పటికే సగం పిచ్ దాటేశాడు. ఇద్దరూ కీపర్ వైపు పరుగు తీశారు. దాంతో నికోలస్ బౌలింగ్ ఎండ్లో వికెట్లను గిరాటేశాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 14 , హార్దిక్ పాండ్యా1 పరుగులతో క్రీజులో ఉన్నారు. 37 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్.. 291/4