ముంబై టెస్టులో ఘోర పరాజయంపై కివీస్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ స్పందించాడు. తొలి ఇన్నింగ్స్లో న్యూజిల్యాండ్ జట్టు కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో కూడా వారు పెద్దగా రాణించలేదు. చివరకు 167 పరుగులకే ఆలౌటయ్యారు. ఈ క్రమంలోనే 372 పరుగుల తేడాతో భారత్ చేతిలో చిత్తుగా ఓడింది.
దీనిపై మాట్లాడిన లాథమ్.. వాంఖడే వంటి పరిస్థితుల్లో భారత్కు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకూడదని అభిప్రాయపడ్డాడు. భారత బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారని లాథమ్ కొనియాడాడు. అలాగే భారత్లో సమయం గడిచేకొద్ది బ్యాటింగ్ చేయడం కఠినంగా మారుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎంత బాగా ఆడుతుందో తమకు తెలుసునని అన్నాడు.
తాము తొలి ఇన్నింగ్స్లో కేవలం 62 పరుగులకే ఆలౌట్ అవడం, మ్యాచ్లో తమ జట్టును వెనుకపడేలా చేసిందని అభిప్రాయపడ్డాడు.