192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలండ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో రెండో బంతికి ఓపెనర్ ఫిన్ అలెన్ అర్షదీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు సూర్య కుమార్ యాదవ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడడంతో 20 ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 13 పరుగలకే ఔట్ అయ్యాడు. దీపక్ హుడా, వాషింగ్టన్ ఇద్దరూ డకౌట్ అయ్యారు.