IND vs NZ : రాయ్పూర్లో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. వన్డేల్లో ఐదు వికెట్ల నష్టానికి 15 పరుగుల అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. భారత బౌలర్లు షమీ, సిరాజ్, పాండ్యా, శార్ధూల్ ఠాకూర్ నిప్పులు చెరగడంతో ఆ జట్టు టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలింది. ఇంతకుముందు 2001లో శ్రీలంకపై ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 18 రన్స్ చేసింది. 2010లో బంగ్లాదేశ్పై మిర్పూర్లో 20 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 2003లో ఫరిదాబాద్లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల నష్టానికి 21 రన్స్ చేసింది.
భారత గడ్డ మీద తక్కువ స్కోర్
భారత గడ్డపై కివీస్ అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఐదు వికట్ల నష్టానికి 15 పరుగులతో ఇంగ్లండ్ను వెనక్కి నెట్టింది. ఇంగ్లండ్ జట్టు 2022లో ఓవల్ మైదానంలో 5 వికెట్లు కోల్పోయి 26 రన్స్ చేసింది. పాకిస్థాన్ 29 పరుగులతో మూడో స్థానంలో ఉంది. కొలంబోలో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 2005 జింబాబ్వే 5 వికెట్లకు 30 పరుగులు చేసింది. 1997లో కొలంబోలో పాక్తో జరిగిన మ్యాచ్లో కివీస్ 5 వికెట్ల నష్టానికి 29 పరుగులు సాధించింది. 2005లో జింబాబ్వేపై 13 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.