కివీస్తో తొలి టెస్టులో భారత బౌలర్లు పట్టుబిగిస్తున్నారు. చివరి ఇన్నింగ్స్లో 284 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ను భారత స్పిన్నర్లు దెబ్బకొట్టారు. వీరి ధాటికి న్యూజిల్యాండ్ జట్టు 125 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
అయితే క్రీజులో కివీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (24) ఉండటంతో న్యూజిల్యాండ్ ఆశలు కోల్పోలేదు. ఈ ఆశలకు జడేజా గండికొట్టాడు. ఎల్బీడబ్ల్యూగా విలియమ్సన్ను పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్కు గెలిచే అవకాశాలు మరింత పెరిగాయి.