న్యూజిల్యాండ్తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు వచ్చిన కీవీస్ మహిళలను.. భారత బౌలర్లు 5 వికెట్లు తీసుకొని 155 పరుగులకు కట్టడి చేశారు. వెటరన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్ ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో భారత బ్యాటింగ్ లైనప్ తడబడింది.
సీనియర్ ఓపెనర్ స్మృతి మంధాన లేకపోవడంతో.. షఫాలీ వర్మ (13)తో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన యువ ప్లేయర్ యాస్తికా భాటియా (26) ఫర్వాలేదనిపించింది. వీళ్లు అవుటైన తర్వాత కెప్టెన్ హర్మన్ (12) కూడా నిరాశపరిచింది. చివర్లో సబ్బినేని మేఘన (30 బంతుల్లో 37) రాణించడంతో భారత్ గెలుపు అవకాశాలు నిలిచాయి.
ఆమె అవుటైన తర్వాత ఏ కోశానా భారత ఇన్నింగ్స్ విజయం దిశగా సాగలేదు. ఈ క్రమంలోనే 18 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. కివీస్ మహిళా బౌలర్లు జెస్ కెర్, అమీలియా కెర్, హేలీ జెన్సెన్ తలో రెండు వికెట్లు తీయగా.. లియా తుహుము, సోషీ డివైన్ చెరో వికెట్ పడగొట్టారు. బౌలింగ్తోపాటు బ్యాటింగ్లోనూ రాణించిన లియాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.