IND vs NZ : టీమిండియాకు షాక్.. వెంట వెంటనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ (7) ఔట్ అయ్యాడు. శాంటర్న్ ఓవర్లో షాట్కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. అంతకుముందు ఓవర్లో రాహుల్ త్రిపాఠి డకౌట్ అయ్యాడు. జాకబ్ డఫీ ఓవర్లో కాన్వే క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. 177 లక్ష్య ఛేదనలో భారత్కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (4) బౌల్డ్ అయ్యాడు. బ్రేస్వేల్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి ఇషాన్ వికెట్ సమర్పించుకున్నాడు. దాంతో, 10 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ (8), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (1) క్రీజులో ఉన్నారు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్.. 20/3.