కివీస్తో జరుగుతన్న రెండో టెస్టు రెండో రోజు భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి రోజు సెంచరీ సాధించిన మయాంక్ అగర్వాల్ (150, 38 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అక్షర్ పటేల్ కూడా అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో 325 పరుగులు చేసిన భారత జట్టు ఆలౌట్ అయింది.
లక్ష్యఛేదనలో న్యూజిల్యాండ్ బ్యాట్స్మెన్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. బౌలర్లంతా సమిష్టిగా రాణించడంతో కివీస్ జట్టు విలవిల్లాడిపోయింది. అశ్విన్ 4, సిరాజ్ 3, అక్షర్ 2, జయంత్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. దీంతో న్యూజిల్యాండ్ జట్టు 62 పరుగులకే చాపచుట్టేసింది. భారత్లో ఒక జట్టు ఇంత తక్కువ స్కోరుకు ఆలౌట్ అవడం ఇదే తొలిసారి.
అయితే న్యూజిల్యాండ్కు ఫాలోఆన్ అవకాశం ఇవ్వడానికి భారత్ అంగీకరించలేదు. దీంతో బరిలో దిగిన భారత్.. ఈసారి ఓపెనర్గా గిల్ స్థానంలో పుజారాను దింపింది. వీరిద్దరూ కలిసి రెండో రోజు ఆటముగిసే సమయానికి 69 పరుగులు జోడించారు. మయాంక్ 38 పరుగులతో, పుజారా 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.