కివీస్తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో 234 పరుగుల స్కోరు వద్ద భారత జట్టు డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ స్కోరు 14/1 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు కష్టాలు తప్పలేదు. పుజారా (22), మయాంక్ అగర్వాల్ (17), అజింక్య రహానే (4) మరోసారి విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితులో అరంగేట్ర ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (65) మరోసారి జట్టును ఆదుకున్నాడు.
అతనికితోడు రవిచంద్రన్ అశ్విన్ (32) కూడా రాణించాడు. జడేజా (0) విఫలమవగా అనూహ్యంగా వృద్ధిమాన్ సాహా (61 నాటౌట్) హాఫ్ సెంచరీ చేశాడు. అక్షర్ పటేల్ (28 నాటౌట్) అతనికి సహకారం అందించాడు. ఈ క్రమంలో ఏడు వికెట్లకు 234 పరుగులు చేసిన భారత్.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతర్ 284 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన కివీస్ను అశ్విన్ ఆదిలోనే దెబ్బకొట్టాడు.
ఓపెనర్ విల్ యంగ్ (2)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దీంతో నాలుగు రోజు ఆటముగిసే సమయానికి కివీస్ జట్టు 4/1 స్కోరుతో నిలిచింది. టామ్ లాథమ్ (2 నాటౌట్), విల్ సోమర్విల్లె (0 నాటౌట్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టును టిమ్ సౌథీ, కైల్ జేమీసన్ దెబ్బకొట్టారు. చెరో మూడు వికెట్లతో చెలరేగారు. అజాజ్ పటేల్ కూడా ఒక వికెట్ తీశాడు.