తొలి ఇన్నింగ్స్లో న్యూజిల్యాండ్ను అత్యంత స్వల్పస్కోరుకే ఆలౌట్ చేసిన భారత జట్టు.. ఫాలో ఆన్ అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్కు దిగింది. గాయపడిన గిల్ స్థానంలో ఛటేశ్వర్ పుజారా (47) ఓపెనర్గా వచ్చాడు. మయాంక్ అగర్వాల్ (62)తో కలిసి వీళ్లిద్దరూ శుభారంభం అందించారు.
అయితే వీరిద్దరూ కూడా అజాజ్ పటేల్ బౌలింగ్లోనే అవుటైపోయారు. ఆ తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ (47), విరాట్ కోహ్లీ (36) ఫర్వాలేదనిపించారు. శ్రేయాస్ అయ్యర్ (14), వృద్ధిమాన్ సాహా (13) వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు కోల్పోయారు. కానీ చివర్లో అక్షర్ పటేల్ (41 నాటౌట్) చెలరేగి ఆడాడు. నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో టీ20 ఆటను తలపించేలా ఆడాడు.
ఇన్నింగ్స్ 70వ ఓవర్లో జయంత్ యాదవ్ (6) అవుటవగానే భారత జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అప్పటికి భారత స్కోరు 276/7. దీంతో కివీస్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.