జైపూర్: తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన తర్వాత కివీస్ బ్యాటింగ్ లైనప్ చాలా నిలకడగా ఆడుతోంది. భువనేశ్వర్ బౌలింగ్లో డారియెల్ మిచెల్ (0) గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చాప్మ్యాన్ (42 నాటౌట్) జట్టును ఆదుకున్నాడు. మార్టిన్ గప్తిల్ (19 నాటౌట్)తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.
చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరి మధ్య 64 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి కివీస్ జట్టు ఒక వికెట్ నష్టానికి 65 పరుగులు సాధించింది.