IND vs NZ : చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారత్కు ఎనిమిదో వికెట్ అందించాడు. ల్యూకీ ఫెర్గూసన్ రోహిత్కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 279 పరుగుల వద్ద కివీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అంతకుముందు ప్రమాదకరమైన బ్రేస్వెల్ను ఔట్ చేశాడు. అతని బౌలింగ్లో బ్రేస్వెల్ స్టంపౌట్ అయ్యాడు. బ్రేస్వెల్, శాంటర్న్ జోడీని విడదీసి కుల్దీప్ మ్యాచ్ను భారత్ వైపు మలుపు తిప్పాడు. అంతకుముందు డ్వేన్ కాన్వే(138) ఆరో వికెట్గా వెనుదిరిగాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. 37ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 273 రన్స్ చేసింది. కివీస్ విజయానికి 66 బంతుల్లో 107 పరుగులు కావాలి.