కివీస్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మయాంక్ అగర్వాల్ (46 నాటౌట్), శుభ్మన్ గిల్ (44) జట్టుకు మంచి ఆరంభమే ఇచ్చారు. ఇలాంటి స్థితిలో భారత్ను న్యూజిల్యాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ దెబ్బకొట్టాడు. తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయిన గిల్.. అజాజ్ పటేల్ బౌలింగ్లో రాస్టేలర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన పుజారా కూడా పటేల్ బౌలింగ్లోనే క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న అతను ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుతిరిగాడు. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) కూడా డకౌట్ అయ్యాడు. అజాజ్ పటేల్ బౌలింగ్లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.
అయితే బంతి అతని బ్యాట్ను తాకినట్లు రీప్లేలో కనిపించింది. కాకపోతే ముందుగా ప్యాడ్ను తాకిందా? లేక బ్యాట్ను తాకిందా అనేది సరిగా అర్ధంకాలేదు. ఈ క్రమంలో ఆన్ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి కోహ్లీని అవుట్గా ప్రకటించారు.