రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ కూల్చాడు. ముంబై టెస్టులో కివీస్ బ్యాట్స్మెన్కు అశ్విన్ పీడకలగా మారాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లతో సత్తా చాటిన ఈ వెటరన్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లిద్దరినీ పెవిలియన్ చేర్చాడు. టామ్ లాథమ్ (6)ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చిన అతను.. మరో ఓపెనర్ విల్ యంగ్(20)ను కూడా అవుట్ చేశాడు.
అశ్విన్ వేసిన బంతిని యంగ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి అతని ప్యాడ్లను తాకి గాల్లోకి ఎగిరింది. షార్ట్లెగ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఈ క్యాచ్ సులభంగా అందుకున్నాడు. అయితే అంపైర్ అవుట్ ఇవ్వలేదు. దీంతో కోహ్లీ రివ్యూ కోరాడు.
రీప్లేలో బంతి బ్యాట్ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. అంపైర్ నిర్ణయాన్ని మార్చుకోవడంతో భారత జట్టు సంబరాల్లో మునిగిపోయింది. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్, డారియల్ మిచెల్ ఉన్నారు. 2021 సంవత్సరంలో అశ్విన్ తీసిన 50వ వికెట్ ఇది. మరే బౌలర్ ఈ ఏడాది ఇన్ని వికెట్లు తీయకపోవడం గమనార్హం.