క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ కష్టాలో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాకు ఆదిలోనే చుక్కెదురయింది. మొదటి వన్డేల్లో జట్టుకు శుభారంభాన్ని అందించిన ఓపెనింగ్ జోడీని 8వ ఓవర్లోనే కివీస్ బౌలర్లు విడగొట్టారు. మంచి ఫామ్లో ఉన్న గిల్ను.. ఇన్నింగ్స్ 8 ఓవర్ 4వ బంతికి ఆడమ్ ఔట్చేశాడు. దీంతో 39 పరుగుల వద్ద టీమ్ఇండియా మొదటి వికెట్ కోల్పోయింది. అయితే నాలుగు ఓవర్ల వ్యవధిలోనే భారత్ మరో వికెట్ను చేజార్చుకుంది.
28 పరుగులు చేసిన టీమ్ఇండియా కెప్టెన్ ధావన్.. ఆడమ్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో రిషబ్ పంత్ క్రీజ్లోకి వచ్చాడు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ 14 (23), పంత్ 4 (3) బ్యాటింగ్ చేస్తున్నారు. 16 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. రెండు వికెట్లను ఆడమ్ తీయడం విశేషం.