కాన్పూర్: టీ20 సిరీస్ క్లీన్స్వీప్ చేసిన భారత్ ఇప్పుడు టెస్ట్ సిరీస్పై కన్నేసింది. న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా కాన్పూర్లో జరుగుతున్న తొలి పోరులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ టెస్టుతో పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ శ్రేయస్ అయ్యర్ టెస్టు అరంగేట్రం చేశాడు. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా అయ్యర్ క్యాప్ను అందుకున్నాడు.
కాగా, పలువురు కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్నది. కోహ్లీ గైర్హాజరీలో జట్టుకు అజింకా రహానే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. భారత్లో ఇప్పటివరకు 34 టెస్టులు ఆడిన కివీస్ 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. కివీస్ పూర్తి బలగంతో బరిలోకి దిగుతుంటే.. భారత్ మాత్రం స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ బృందంతో యుద్ధానికి రెడీ అయింది.
భారత్: రహానే (కెప్టెన్), శుబ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్, జడేజా, సాహా, అశ్విన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్.
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), లాథమ్, విల్ యాంగ్, రాస్ టేలర్, నికోల్స్, బ్లండెల్, రవీంద్ర, జెమీసన్, టిమ్ సౌథీ, సోమర్విల్లె, అజాజ్ పటేల్.
🎥 A moment to cherish for @ShreyasIyer15 as he receives his #TeamIndia Test cap from Sunil Gavaskar – one of the best to have ever graced the game. 👏 👏#INDvNZ @Paytm pic.twitter.com/kPwVKNOkfu
— BCCI (@BCCI) November 25, 2021