Womens T20 WC : మహిళల టీ20 వరల్డ్ కప్ చివరి గ్రూప్ మ్యాచ్లో భారత జట్టు ఐర్లాండ్తో తలపడుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా నేరుగా సెమీఫైనల్ చేరుతుంది. కీలకమైన పోరు కోసం భారత్ పూర్తిస్థాయిలో సన్నద్దమైంది. రాధా యాదవ్ ప్లేస్లో దేవికా యాదవ్ జట్టులోకి వచ్చింది.
గత మ్యాచ్లో భారత్, ఇంగ్లండ్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతో, సెమీస్ చేరాలంటే ఐర్లాండ్పై గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే.. వెస్టిండీస్ జట్టు 3 పరుగుల తేడాతో పాకిస్థాన్ను ఓడించడంతో భారత జట్టు అవకాశాలు మెరుగుపడ్డాయి. ప్రస్తుతం ఇండియా నాలుగు పాయింట్లతో గ్రూప్-2లో రెండో స్థానంలో ఉంది. మూడు విజయాలతో ఇంగ్లండ్ టాప్ ప్లేస్ దక్కించుకుంది.