భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్కు వరుణుగు పలుమార్లు అంతరాయం కలిగించాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప్రారంభం అవడమే తరువాయి అని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలో మరోసారి వర్షం ప్రారంభమైంది.
ఈ వర్షం ఆగిన కాసేపటికే మరోసారి వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో మ్యాచ్ను 12 ఓవర్లకు కుదించినట్లు మ్యాచ్ నిర్వాహకులు ప్రకటించారు. అది కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 11.20 కల్లా మ్యాచ్ ప్రారంభమైతేనే. తొలి నాలుగు ఓవర్లు పవర్ప్లే ఓవర్లు కానున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత సారధి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.
The rain has stopped and the covers are coming off! There's still no word on a start time but some positive news.#IREvIND | #BackingGreen in association with EXCHANGE22 and #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/sNtKOE8aV3
— Cricket Ireland (@cricketireland) June 26, 2022