వర్షం అంతరాయం కలిగించిన భారత్-ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ ఎట్టకేలకు ఆరంభమైంది. రెండు జట్లకు 12 ఓవర్ల చొప్పున కుదించిన ఈ మ్యాచ్లో ఐర్లాండ్ బ్యాటింగ్కు వచ్చింది. తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్.. ఐదో బంతికి ఐర్లాండ్ కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ(0)ని పెవిలియన్ చేర్చాడు.
భువీ వేసిన బంతిని సరిగి అంచనా వేయలేకపోయిన ఆండీ.. దాన్ని ఆఫ్ సైడ్ పంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దాంతో ఆ బంతి వికెట్లను కూల్చింది. ఆ మరుసటి ఓవర్లో బంతి అందుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. రెండో బంతికే పాల్ స్టిర్లింగ్ (4)ను పెవిలియన్ చేర్చాడు.
ఆఫ్ స్టంప్ ఆవల హార్దిక్ వేసిన బంతిని ఫీల్డర్ల మీదుగా బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించిన స్టిర్లింగ్ విఫలమయ్యాడు. గాల్లోకి లేచిన బంతిని దీపక్ హుడా అందుకోవడంతో ఆ జట్టు రెండు ఓవర్లలోనే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది.