చాలారోజుల తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ సారధిగా అద్భుతమైన పరిణితి కనబరిచిన అతనికి.. ఐర్లాండ్లో ఆడే టీమిండియా పగ్గాలు అందించారు. ఈ క్రమంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్, మిగతా సీనియర్ ఆటగాళ్ల ముందు తనను తాను ఎలా నిరూపించుకుంటాడనే ప్రశ్న పాండ్యాకు ఎదురైంది.
దీనికి సూటిగా బదులిచ్చిన పాండ్యా.. తను ఎవరి ముందు ఏదో చూపించాలని క్రికెట్ ఆడటం లేదని స్పష్టం చేశాడు. భారత జట్టుకు సారధ్యం వహించే అవకాశం దక్కడమే తనకు గొప్ప విషయమని, అంతేకానీ ఏదో నిరూపించుకోవాలనే ఆలోచన లేదని చెప్పాడు. అలాగే ఐర్లాండ్తో సిరీస్లో బెస్ట్ పదకొండు మంది మైదానంలో దిగేలా ప్రణాళికలు వేస్తున్నామని, అదే సమయంలో కొత్త ఆటగాళ్లకు అవకాశాలు కూడా ఇవ్వాలని అనుకుంటున్నామని వెల్లడించాడు.
ప్రస్తుతం భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ సిరీస్ కోసం సిద్ధమవుతుండగా.. ఐర్లాండ్ సిరీస్ కోసం యువ జట్టును బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు పాండ్యా నాయకత్వం వహిస్తుండగా.. సన్రైజర్స్ తరఫున అద్భుతంగా ఆడిన రాహుల్ త్రిపాఠీకి ఈ జట్టులో చోటు దక్కింది. అతను కాకుండా ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ కూడా అరంగేట్రం చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
An honour to lead #TeamIndia 🇮🇳 Grateful for the opportunity. We’ll give it our all ✌️💥 pic.twitter.com/6D13DlCFop
— hardik pandya (@hardikpandya7) June 25, 2022