టీమిండియా కెప్టెన్గా తను ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన అతను.. ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. డబ్లిన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో భారత జట్టులో మూడు మార్పులు జరిగినట్లు తెలిపాడు.
రుతురాజ్, చాహల్, ఆవేష్ ఖాన్ ఆడటం లేదని చెప్పిన పాండ్యా.. వారి స్థానాల్లో శాంసన్, హర్షల్ పటేల్, బిష్ణోయి ఆడుతున్నట్లు వెల్లడించాడు. అలాగే గత మ్యాచ్లో దినేష్ కార్తీక్ కీపింగ్ చేయగా.. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఆ బాధ్యతలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు సారధి బాల్బిర్నీ తెలిపాడు.
భారత జట్టు: దీపక్ హుడా, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయి, ఉమ్రాన్ మాలిక్
ఐర్లాండ్ జట్టు: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్బిర్నీ (కెప్టెన్), గారెత్ డెలనీ, హ్యారీ టెక్టర్, లాక్రాన్ టక్కర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, ఆండీ మెక్బ్రైన్, క్రెయిగ్ యంగ్, జోషువా లిటిల్, కానర్ ఓఫర్ట్.
Three changes in the Playing XI for #TeamIndia
Sanju Samson comes in for Ruturaj Gaikwad
Ravi Bishnoi comes in for Yuzvendra Chahal
Harshal Patel comes in for Avesh KhanLive – https://t.co/l5jcWYMcNk #IREvIND pic.twitter.com/608JoPNBoK
— BCCI (@BCCI) June 28, 2022